ముంబై మహారథి  శుభారంభం

15 Jan, 2019 02:04 IST|Sakshi

పంచ్‌కులా (హరియాణా): ప్రొ రెజ్లింగ్‌ లీగ్‌లో భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ సభ్యురాలిగా ఉన్న ముంబై మహారథి జట్టు శుభారంభం చేసింది. సోమవారం జరిగిన తొలి పోటీలో ముంబై మహారథి 4–3తో డిఫెండింగ్‌ చాంపియన్‌ పంజాబ్‌ రాయల్స్‌ను ఓడించింది. 53 కేజీల బౌట్‌లో వినేశ్‌ (ముంబై) 8–0తో అంజుపై గెలిచింది. ముంబై తరఫున ఇలియాసోవ్‌ (57 కేజీలు), సచిన్‌ రాఠి (74 కేజీలు), నెమెత్‌ (76 కేజీలు) కూడా విజయం సాధించారు. పంజాబ్‌ రాయల్స్‌ తరఫున 65 కేజీల విభాగంలో ఆసియా క్రీడల విజేత బజరంగ్‌ పూనియా 8–2తో హర్‌ఫుల్‌పై గెలిచాడు.    

మరిన్ని వార్తలు