జాతీయ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీ షురూ

31 Mar, 2018 11:15 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగరంలో జిమ్నాస్టిక్స్‌ సందడి మొదలైంది. సరూర్‌నగర్‌ స్టేడియంలో జాతీయ రిథమిక్‌ జిమ్నాస్టిక్స్‌ టోర్నీ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ జిమ్నాస్టిక్స్‌ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తీగల కష్ణారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. జూనియర్స్, సీనియర్స్‌ విభాగాల్లో జరిగే ఈ టోర్నమెంట్‌లో దేశంలోని 9 రాష్ట్రాలకు చెందిన 100 మంది జిమ్నాస్ట్‌లు పాల్గొన్నారు.

రెండు రోజుల పాటు హూప్, బాల్, క్లబ్స్, రిబ్బన్‌ ఈవెంట్‌లలో వ్యక్తిగత, ఆల్‌రౌండ్‌ విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జీఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు కౌశిక్‌ బిడివాలా, టోర్నమెంట్‌ డైరెక్టర్‌ శశి, ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (ఓఏటీ) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. రంగారావు, సలహాదారు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ నేతలు అరవింద్‌ రెడ్డి, దయాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

>
మరిన్ని వార్తలు