తెలుగు టైటాన్స్‌ పరాజయం 

10 Nov, 2018 03:31 IST|Sakshi

ముంబై: ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ మూడో ఓటమి మూటగట్టుకుంది. జోన్‌ ‘బి’లో భాగంగా శుక్రవారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 25–30తో బెంగాల్‌ వారియర్స్‌ చేతిలో ఓడింది. టైటాన్స్‌ తరఫున స్టార్‌ రైడర్‌ రాహుల్‌ చౌదరి 8 పాయింట్లు సాధించగా... ట్యాక్లింగ్‌లో ఫర్హద్‌ (5 పాయింట్లు) రాణించాడు. మరో మ్యాచ్‌లో యు ముంబా 48–24తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. నేటి మ్యాచ్‌ల్లో పట్నా పైరేట్స్‌తో బెంగాల్‌ వారియర్స్, యు ముంబాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ తలపడనున్నాయి.    

మరిన్ని వార్తలు