గత ఏడాదంతా నంబర్వన్ ర్యాంక్లో నిలిచిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ ఏడాది ఏమాత్రం కలిసి రాలేదు. సోమవారం విడుదల చేసిన మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) డబుల్స్ ర్యాంకింగ్స్లో సానియా మూడు స్థానాలు పడిపోయి 12వ ర్యాంక్లో నిలిచింది. 2014 మార్చి 3 తర్వాత సానియాకు టాప్–10లో చోటు దక్కకపోవడం ఇదే తొలిసారి.
ఈ ఏడాది సానియా కేవలం ఒక టైటిల్ మాత్రమే సాధించింది. మరోవైపు పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్లో భారత ఆటగాడు దివిజ్ శరణ్ తొలిసారి టాప్–50లోకి దూసుకొచ్చాడు. ఇటీవలే యూరోపియన్ ఓపెన్లో డబుల్స్ టైటిల్ నెగ్గిన దివిజ్ సోమవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్లో సరిగ్గా 50వ ర్యాంక్లో నిలిచాడు.