నేపియర్: ఆస్ట్రేలియాపై చారిత్రక టెస్టు, వన్డే సిరీస్ గెలిచిన అనంతర టీమిండియా న్యూజిలాండ్తో మరో సమరానికి సిద్దమైంది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా తొలి వన్డే బుధవారం నేపియర్లోని మెక్లీన్ పార్క్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కివీస్ సారథి తొలుత విలియమ్సన్ బ్యాటింగ్కే మొగ్గుచూపాడు. న్యూజిలాండ్లో తమ పేలవ రికార్డును చెరిపేసేందుకు టీమిండియా తహతహలాడుతుంది. ఈ మ్యాచ్లో కోహ్లి సేన రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, దినేశ్ కార్తీక్ స్థానాలలో కుల్దీప్ యాదవ్, అంబటి రాయుడులకు టీమ్ మేనేజ్మెంట్ చోటు కల్పించింది. మెక్లీన్ పార్క్ మైదానం చిన్నదిగా ఉండటంతో పాటు.. పిచ్ బ్యాటింగ్కు అనుకూలాంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తుది జట్లు
భారత్: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లి (కెప్టెన్), ధోని, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, కుల్దీప్ యాదవ్, షమీ, భువనేశ్వర్, చహల్.
న్యూజిలాండ్: గప్టిల్, మున్రో, విలియమ్సన్ (కెప్టెన్), రాస్ టేలర్, లాథమ్, నికోల్స్, సాన్ట్నర్, సౌతీ, ఫెర్గూసన్, బ్రాస్వెల్, బౌల్ట్.