చెన్నైలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్

1 Jul, 2016 14:05 IST|Sakshi

చెన్నై: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా పోలీసులు చెన్నైలో ఇద్దరు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. తిరుపతి పోలీసులు చెన్నైలో సిడ్కో పారిశ్రామికవాడలో తనిఖీలు నిర్వహించి ఎర్రచందనం స్మగ్లర్లు రమేష్, విశాల్ను అరెస్ట్ చేశారు.

రెండు కంటైనర్లలో ఉన్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 237 ఎర్రచందనం దుంగలను, రెండు ఎలక్ట్రికల్ వేయింగ్ మిషన్లను, రెండు ఉడ్ కట్టర్ మిషన్లను స్వాధీనం చేసుకున్నట్టు తిరుపతి అర్బన్ ఎస్పీ విజయలక్ష‍్మి చెప్పారు.
 

మరిన్ని వార్తలు