విజయవాడ: సహకార రంగంలోని బ్యాంకుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా విజయవాడలో ఆ బ్యాంకుల ఉద్యోగులు ఆందోళన చేశారు. రద్దయిన పెద్ద నోట్ల మార్పిడిలో డీసీసీబీలపై ఆర్బీఐ నిషేధం విధించింది. దీన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఆర్బీఐ ఆంక్షలను వ్యతిరేకిస్తూ విజయవాడ కేడీసీసీ బ్యాంకు నుంచి లెనిన్ సెంటర్ వరకు ఉద్యోగులు నిరసన ర్యాలీ నిర్వహించారు.