విజయవాడ: చంద్రబాబు చేతకానితనం వల్లే ప్రత్యేక హోదా రావడం లేదని ఏపీసీసీ అధికార ప్రతినిధి తులసీరెడ్డి విమర్శించారు. శుక్రవారం విజయవాడలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే హోదా కోసం పార్లమెంట్ ముందు ధర్నాకు దిగాలన్నారు. లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.