చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం

31 Oct, 2016 11:42 IST|Sakshi
వీకోట: చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మద్దిమాకులపల్లిలో ఐదు ఏనుగులు సోమవారం తెల్లవారుజామున పంటలపై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. పదిమంది రైతులకు చెందిన సుమారు 15-20 ఎకరాల్లోని వరి మడి, క్యాబేజీ, బీన్స్ పంటలను అవి ధ్వంసం చేశాయి. దీంతో రైతులకు రూ.5 నుంచి రూ.7 లక్షల వరకు నష్టం వాటిల్లింది. అటవీ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.
మరిన్ని వార్తలు