మాజీ ఎమ్మెల్యే అరెస్ట్‌

3 Oct, 2017 01:22 IST|Sakshi

మోదీ, పళనిస్వామికి వ్యతిరేకంగా పోస్టర్లు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీతో పాటు తమిళనాడు సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా కరపత్రాలు, పోస్టర్లు ముద్రిం చారనే ఆరోపణలపై దినకరన్‌ వర్గానికి చెందిన సేలం మాజీ ఎమ్మెల్యే వెంకటాచలం సహా నలుగురిని పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. అలాగే టీటీవీ దినకరన్‌ సహా 14 మందిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. కేంద్రం నీట్‌ను బలవంతంగా తమిళనాడు విద్యార్థులపై రుద్దుతుందంటూ పలు విమర్శలు చేస్తూ కరపత్రాలను ముద్రించారని పోలీసులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు