ప్రముఖ వ్యాయామ శిక్షణా సంస్థ గోల్డ్స్ జిమ్ నగరంలో తన శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించింది. సోమవారమిక్కడ నిర్వహించిన వ్యాయామ శిక్షణా కేంద్ర ప్రారంభోత్సవంలో శాండల్వుడ్ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్ సందడి చేశారు. వ్యాయామ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఈ కేంద్రంలోని అత్యాధునిక వ్యాయామ పరికరాల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పునీత్ రాజ్కుమార్ మాట్లాడుతూ...ప్రస్తుత ఆధునిక జీవనంలో భాగంగా మారిపోయిన రోజువారీ ఒత్తిళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యాయామం చాలా ఉపయోగపడుతుందని అన్నారు. అందుకే రోజూ తన దినచర్య వ్యాయామంతోనే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోల్డ్స్ జిమ్ సంస్థ వైస్ ప్రసిడెంట్ ఆల్తేయా షా, డెరైక్టర్ ఎంబీ వినయ్ తదితరులు పాల్గొన్నారు.
- సాక్షి, బెంగళూరు