జల సమాధి | Sakshi
Sakshi News home page

జల సమాధి

Published Tue, Nov 11 2014 1:38 AM

జల సమాధి - Sakshi

చెరువులో మునిగి  ముగ్గురు విద్యార్థినుల మృతి
 
కోలారు : చెరువులో మునిగి ముగ్గురు విద్యార్థినులు మృతి చెందిన ఘటన  ఆదివారం సాయంత్రం శ్రీనివాసపురం తాలూకాలోని భీమగుంటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గౌనిపల్లి పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. భీమగుంటపల్లికి చెందిన విద్యార్థినులు భారతి (15), రమ్య(15), ప్రసన్న(15). వీరు గౌనిపల్లి వెంకటేశ్వర విద్యా సంస్థలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో గ్రామ సమీపంలోని చెరువుకు ఈ ముగ్గురూ ఈతకు వెళ్లారు. మొదట భారతి చెరవులోకి దిగింది.

చెరువులో భారతి మునిగిపోతుండగా.. రక్షించడానికి రమ్య, ప్రసన్న కూడా చెరువులోకి దిగారు. వీరందరూ మునిగిపోతూ  గట్టిగా కేకలు వేశారు. వీరిని గమనించిన ఓ బాలిక గ్రామంలోకి  వెళ్లి  సమాచారం అందించింది. గ్రామస్తులు చెరువు వద్దకు చేరుకునే లోపే ఆ ముగ్గురు విద్యార్థినులు ప్రాణాలు వదిలారు. గౌనిపల్లి పోలీసులు కేసు దర్యాప్తు  చేస్తున్నారు.  
 

Advertisement
Advertisement