పోలీస్‌ స్టేషనే కళ్యాణ వేదిక

24 Apr, 2020 13:34 IST|Sakshi
మూడుముళ్లతో ఒక్కటైన ప్రేమజంట

కర్ణాటక, దొడ్డబళ్లాపురం: లాక్‌డౌన్‌ అమలులో బిజీ బిజీగా ఉన్న పోలీసులు కనకపుర తాలూకాలో ప్రేమికులను ఒక్కటి చేశారు. కనకపుర తాలూకా తావరగట్టె గ్రామం నివాసి పవన్‌ (23), మూలెగుంది గ్రామానికి చెందిన శృతి (23)ఇద్దరూ బాల్య స్నేహితులు. ప్రేమించుకుని పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ కులాలు వేరని పెద్దలు అంగీకరించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. లాక్‌డౌన్‌ టెన్షన్‌లోనూ పోలీసులు వారికి సాతనూరు స్టేషన్‌లోనే వివాహం జరిపించి ఆశీర్వదించారు.

మరిన్ని వార్తలు