పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

15 Mar, 2019 12:54 IST|Sakshi
ప్రేమజంట

తిరువళ్లూరు: పెద్దల నుంచి బెదిరింపులు వస్తున్నాయని తమకు భద్రత కల్పించాలని బుధవారం ప్రేమజంట తిరువళ్లూరు ఎస్పీని ఆశ్రయించింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌కుప్పం గ్రామానికి చెందిన తిలకవతి(21), పుణ్యం గ్రామానికి చెందిన చిన్నరాసు(24) పొదటూరుపేటలోని ఓ ప్రవేట్‌ కళాశాలలో బీఎడ్‌ చదువుతున్నారు. వీరు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియడంతో తిలకవతికి వివాహ సంబంధాలు చూడడం ప్రారంభించారు. దీంతో ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయి గత 7వ తేదీన చెన్నైలో వివాహం చేసుకున్నారు. ఈ సమాచారంతో యువతి తల్లిదండ్రులు బెదిరింపులకు దిగడంతో వారు మంగళవారం చెన్నై కమిషనర్‌ను కలిసి తమకు భద్రత కల్పించాలని కోరారు. కమిషనర్‌ సూచన మేరకు తిరువళ్లూరు ఎస్పీ పొన్నిని బుధవారం రాత్రి కలిసి భద్రత కల్పించాలని విన్నవించారు. ఎస్పీ తిరువళ్లూరు మహిళ పోలీసులను ఆశ్రయించాలని సూచించారు. దీంతో ప్రేమజంట మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐకు ఫిర్యాదు చేశారు. సీఐ ఇరు కుటుంబాల బంధువులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇవ్వడానికి చర్యలు చేపట్టారు.

>
మరిన్ని వార్తలు