ర్యాగింగ్‌కు వైద్య విద్యార్థి బలి

23 Nov, 2013 02:04 IST|Sakshi

పళ్లిపట్టు, న్యూస్‌లైన్:  ర్యాగింగ్ భూతానికి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయా డు. ఈ విషాదకర సంఘటన కాంచీపురంలో శుక్రవారం చోటుచేసుకుంది. కృష్ణగిరికి చెందిన ముహుల్ రాజ్‌కుమార్(18) కాంచీపుర ంలోని మీనాక్షి ప్రయివేటు వైద్య కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్‌లోనే ఉంటున్నాడు. ముహుల్‌రాజ్ కుమార్‌ను సీనియర్లు తీవ్రస్థాయిలో ర్యాగింగ్ చేసినట్లు సమాచారం. ఈ దృష్ట్యా బయట గది తీసుకుని చదువుకుంటానని తల్లిదండ్రులకు అతను చెప్పినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే గురువారం రాత్రి తన గదిలో  ఉన్న చీకటీగల మందు తాగి స్పృహ కోల్పోయా డు. రాజ్‌కుమార్‌కు తోటి విద్యార్థులు ఆస్పత్రికి తరలించారు. రాత్రి 11 గంట ల సమయంలో అతను ప్రాణాలు విడిచాడు. బిడ్డను కోల్పోయిన తల్లిదండ్రు ల రోదన చూసి ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు. మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడ్డ సీనియర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థులు కళాశాల ఎదుట ఆందోళనకు దిగారు. కాంచీపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు