పశువధ నిషేధంపై బెంగళూరులో ఆందోళనలు

2 Jun, 2017 20:40 IST|Sakshi

బెంగళూరు : దేశవ్యాప్తంగా పశువధ నిషేధం ఆదేశాలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్థానికులు నిరసన చేపట్టారు. రోడ్లపైకి భారీగా చేరుకున్న ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పశువధపై ఆంక్షల విషయంలో మోదీ సర్కార్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.

 

మరిన్ని వార్తలు