ఎన్‌టీపీసీలో విద్యుదుత్పత్తికి అంతరాయం

10 Jan, 2017 11:27 IST|Sakshi
జ్యోతినగర్:‌ పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీలో విద్యుత్‌ ఉత్పత్తి కి అంతరాయం ఏర్పడింది. ఐదో యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయమేర్పడింది. బాయిలర్‌ ట్యూబ్‌లో లీకేజీ అవడంతో విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో అధికారులు మరమ్మతులు ప్రారంభించారు. ప్రస్తుతం ప్లాంట్‌లో 2,100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.
మరిన్ని వార్తలు