ఐఫోన్లపై పేటీఎం భారీ డిస్కౌంట్

15 Jun, 2017 18:48 IST|Sakshi
ఐఫోన్లపై పేటీఎం భారీ డిస్కౌంట్
దేశమంతటిన్నీ ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే జీఎస్టీ అమలుకు ఇంకా 15 రోజులే మిగిలిఉంది. ఈ లోపల పాత స్టాక్ న్నంతటిన్నీ విక్రయించుకోవడం కోసం రిటైలర్లకు ప్రముఖ పేమెంట్ యాప్ పేటీఎం ప్రీ-జీఎస్టీ క్లియరెన్స్ సేల్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నేటితో ముగియనున్న ఈ సేల్ లో ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఐఫోన్ 7(128జీబీ, జెట్ బ్లాక్ కలర్) పై 24 శాతం డిస్కౌంట్ ను పేటీఎం ఆఫర్ చేస్తోంది. దీంతో 70వేల రూపాయలుగా ఉన్న ఈ ఐఫోన్ 53,333కే అందుబాటులో ఉంది. దాంతో పాటు 32జీబీ ఐఫోన్ 7ను 46,182 రూపాయలకే విక్రయిస్తోంది. కాగ, ఈ ఫోన్ ఒరిజినల్ ధర 60వేల రూపాయలు.
 
ఐఫోన్ 6ఎస్ 32జీబీ ఫోన్ ను కూడా కొనుగోలు దారుల కోసం 36,666రూపాయలకు, ఐఫోన్ 6ను 27,285 రూపాయలకు అందుబాటులో ఉంచింది. ఈ డిస్కౌంట్లతో పాటు ఐఫోన్ 7 ప్లస్ స్మార్ట్ ఫోన్ పై 7000 రూపాయల క్యాష్‌ బ్యాక్, ఐఫోన్ 7 ప్లస్ 256జీబీ స్మార్ట్ ఫోన్ పై 10వేల రూపాయల క్యాష్ బ్యాక్ ను పేటీఎం అందిస్తోంది. ఆపిల్ ఐఫోన్ 7 రెడ్ కలర్ ఒరిజినల్ స్మార్ట్ ఫోన్ ధర 80వేల రూపాయలైతే, ఈ ఫోన్ ను కూడా 70,999రూపాయలకే విక్రయిస్తోంది. వీటితో పాటు లెనోవో ల్యాప్ టాప్ పై 20వేల రూపాయల క్యాష్ బ్యాక్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లపై 10వేల రూపాయల డిస్కౌంట్ ను, ఎల్ఈడీ టీవీలపై 20వేల తగ్గింపును  పేటీఎం ఆఫర్ చేస్తోంది. 
మరిన్ని వార్తలు