ఔటర్‌పై రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

10 Dec, 2015 09:38 IST|Sakshi
మహేశ్వరం: ఔటర్ రింగ్‌రోడ్డు పై గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ సమీపంలో ఔటర్ లో ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. దీంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు నల్లగొండ జిల్లా వాసిగా గుర్తించారు. 
 
మరిన్ని వార్తలు