హైదరాబాద్: తెలంగాణలోని బీడి కార్మికులకి శుభవార్త. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 1,20,419మంది బీడీ కార్మికులకు నెలకు రూ.1000 చొప్పున భృతి అందనుంది. వారికి ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయల భృతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు బీడీ కార్మికులకు భృతి అందించే ఫైలు పై సీఎం కేసీఆర్ మంగళవారం సంతకం చేశారు.