2 ఇసుక లారీలు సీజ్

14 Feb, 2015 12:53 IST|Sakshi

నిజామ్‌సాగర్: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అధికారులు శుక్రవారం అర్ధరాత్రి సీజ్ చేశారు. గత కొంత కాలంగా నిజామాబాద్ జిల్లాలో  రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుండటంతో రవాణాను అడ్డుకోవడానికి అధికారులు నిఘా పెట్టారు. అందుకోసం ప్రత్యేక చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో నిజామ్‌పట్టణంలోని నౌర్సింగ్‌రావుపల్లి వద్ద ప్రత్యేక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీలలో పోలీసులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పాల్గొని ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు లారీలను అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లారీ డ్రైవర్లు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు