రంగారెడ్డి జిల్లా : మద్యం సేవించి వాహనాలు నడుపుతున్నవారికి చెక్ చెప్పేందుకు ఎల్బీనగర్, ఉప్పల్ ట్రాఫిక్ పోలీసు విభాగం అధికారులు సోమవారం నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో 29 కేసులను నమోదు చేసి మంగళవారం కోర్టులో హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ పుష్పాదేశ్ముఖ్ డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వాహనదారుల తల్లిదండ్రులు, భార్యలను పిలిపించి వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, మద్యం సేవించి వాహనాలు నడిపిన 27 మందికి రూ.2వేల జరిమానా, అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి నాలుగు రోజుల జైలుశిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.