31 కేంద్రాల్లో ఎస్సై రాత పరీక్ష

11 Apr, 2016 01:24 IST|Sakshi

హాజరు కానున్న  21, 250 మంది ‘ఎస్సై’ అభ్యర్థులు
వివరాలు వెల్లడించిన సీపీ


వరంగల్ క్రైం : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులకు ఈ నెల 17న నిర్వహించ నున్న ప్రిలిమినరీ రాత పరీక్షకు సంబంధించి 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ జి.సుధీర్‌బాబు ఆదివారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు మొత్తం 21,250 మంది అభ్యర్థులు హాజరవుతారని పేర్కొన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు