వాటర్ ట్యాంకర్ ఢీకొని బాలుడి మృతి

1 May, 2015 13:39 IST|Sakshi

హైదరాబాద్: నగరంలోని మెహదీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. గుడిమల్కాపూర్ పూల మార్కెట్ పక్కన వాటర్ ట్యాంకర్ ఢీకొనడంతో తరుణ్(7) అనే బాలుడు శుక్రవారం మృతి చెందాడు. ప్రమాదం జరిగినపుడు కొనఊపిరి ఉండటంతో స్థానికులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. పోలీసులు వాటర్ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాలుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు