ఆర్టీసీ బస్సు, బైక్ ఢీ.. ఒకరి మృతి

24 May, 2015 09:05 IST|Sakshi

తల్లాడ (ఖమ్మం): ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరొకరికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అన్నారిగూడ వద్ద ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బైక్ పై వెళ్తోన్న భార్యభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో భర్త అక్కడికక్కడే మృతిచెందగా, భార్యకు గాయాలయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు