ఏసీబీకి చిక్కిన అకౌంట్స్ ఆఫీసర్‌

21 Sep, 2015 18:52 IST|Sakshi

సిరిసిల్ల (కరీంనగర్) : రూ.16 వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌ ఏసీబీకి చిక్కాడు. ఈ సంఘటన కరీనంగర్ జిల్లా సిరిసిల్లలో సోమవారం జరిగింది. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘంలో జూనియర్ అకౌంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న రవి మండల కేంద్రానికి చెందిన యాద అంజయ్య అనే కాంట్రాక్టర్ నుంచి రూ.16 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.

మరిన్ని వార్తలు