లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఉద్యోగి

20 Nov, 2015 18:41 IST|Sakshi

అబిడ్స్ (హైదరాబాద్) : లంచం తీసుకుంటూ విద్యా శాఖ ఉద్యోగి ఒకరు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయారు. గన్‌ఫౌండ్రీలోని జిల్లా విద్యా శాఖ అధికారి కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ వహీదుద్దీన్... శుక్రవారం సాయంత్రం ఓ వ్యక్తి నుంచి రూ.4 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు