కేంద్ర వ్యవసాయ మంత్రి దిష్టిబొమ్మ దహనం

27 Jul, 2015 04:23 IST|Sakshi

వినాయక్‌నగర్ : రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి దండి వెంకట్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం స్థానిక బస్టాండ్ ఎదుట కేంద్ర వ్యవసాయ మంత్రి దిష్టిబొమ్మను దహనం చేశా రు. ఈ  కార్యక్రమంలో దండి వెంకట్ మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నదనడానికి వ్యవసాయ మంత్రి అనుచిత వ్యాఖ్యలే నిదర్శనమని అన్నారు.

‘‘దేశ ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని ప్రధాని మోదీ చెబుతున్నారు. ఆ మంచి.. ఇదేనా?’’ అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్దిరాములు, వెంకట్ గౌడ్, కె.మధు, సుజాత, శంశుద్దీన్, నరేష్, అనిల్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు