ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలోని దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద సోమవారం ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో
భార్యభర్తలు మృతిచెందగా, ఇద్దు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి.
ఎదురుగా వస్తున్న లారీ, వారు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. తీవ్రగాయాలపాలైన ఆ ఇద్దరి చిన్నారుల పరిస్థితి విషమించడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.