ఆంధ్రప్రభ ఇన్‌చార్జ్ ఎడిటర్ అరెస్టు

4 May, 2015 22:17 IST|Sakshi

బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆంధ్రప్రభ పత్రిక ఇన్‌చార్జి ఎడిటర్ చంద్రశేఖర్, భద్రాచలం విలేకరి షేక్‌మహబూబ్, సబ్ ఎడిటర్ విజయలక్ష్మిలను జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా మహ్మద్ ప్రవక్త బొమ్మను వేశారంటూ పలు ముస్లిం సంస్థలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లిహిల్స్ పోలీసులు వారిని అరెస్టు చేశారు. నాలుగు రోజుల నుంచి పలువురు ముస్లింలు పత్రికా కార్యాలయం వద్ద, పోలీస్‌స్టేషన్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు