హైదరాబాద్పై కోల్కతా విజయం | Sakshi
Sakshi News home page

హైదరాబాద్పై కోల్కతా విజయం

Published Mon, May 4 2015 11:50 PM

హైదరాబాద్పై కోల్కతా విజయం

కోల్కతా : ఐపీఎల్-8లో భాగంగా సోమవారం ఇక్కడ ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరిగిన 38వ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. అయితే కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాడు ఉమేశ్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.కోల్కతా నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు 132 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.  ఆదిలోనే తడబడిన సన్రైజర్స్ తొలి ఓవర్కే రెండు వికెట్లు కోల్పోయింది.

తొలుత ఒపెనర్లుగా దిగిన ధావన్, వార్నర్ (4) పెవిలియన్ చేరగా, ఆ తరువాత వచ్చిన ఓజా ఖాతా తెరవకుండానే వెనుతిరిగాడు. దాంతో  సన్ రైజర్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. హైదరాబాద్ ఆటగాళ్లు ధావన్ (15),  హెన్రీక్స్ (41), మెర్గాన్ (5), విహారి (6), బిపల్ శర్మ (1), కర్ణ శర్మ ( 32), ప్రవీణ్ కుమార్ (12) వరుసగా పెవిలియన్ బాట పట్టారు. భువనేశ్వర్ కుమార్ (1) నాటౌట్, స్టేయిన్ (1) నాటౌట్గా నిలిచారు. కోల్ కతా బౌలర్లు, ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు, హాగ్ రెండు వికెట్లు, చావ్లా, రస్సెల్, జాన్ బోతా తలో ఒక వికెట్ తీసుకున్నారు.

అంతకముందు బ్యాటింగ్ చేసిన కోల్ కతా నైట్ రైడర్స్ ఏడు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కోల్ కతా ఓపెనర్లు ఉతప్ప (30), గంభీర్ (31), పాండె (33) రనౌట్, రస్సెల్ (1), డస్కటె (8), పటాన్ (30) నాటౌట్, జాన్ బోతా (12), సూర్యకుమార్ యాదవ్ (6), చావ్లా (9) నాటౌట్ గా నిలిచారు.

Advertisement
Advertisement