విద్యుత్ తీగ తెగిపడి మూగజీవాల మృతి

24 Apr, 2015 17:03 IST|Sakshi

చండ్రుగొండు : ఖమ్మం జిల్లా చండ్రుగొండు మండలం బాల్యాతండా శివారులో శుక్రవారం ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగ తెగిపడి నాలుగు మూగజీవాలు మృత్యువాత పడ్డాయి.

 

వేర్వేరు రైతులకు చెందిన రెండు ఆవులు, ఒక ఎద్దు, ఒక దూడ మేత మేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతానికి గురైన ఆ నాలుగు మూగజీవాలు అక్కడికక్కడే చనిపోయాయి.

>
మరిన్ని వార్తలు