గోదావరి ప్రాజెక్ట్‌లపై ఏరియల్ సర్వే

25 Mar, 2015 01:51 IST|Sakshi

ఏటూరునాగారం: కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సత్వర పూర్తి, వాటా మేరకు జలాల పూర్తిస్థారుు విని యోగమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ మేరకు గోదావరి ప్రాజెక్టులకు వాస్తవ నీటి కేటారుుంపు, లభ్యతనీరు, నిర్దేశించుకున్న ఆయకట్టు, ప్రాజెక్ట్‌ల పరిధిలో చేపట్టాల్సిన రిజర్వాయర్, పంప్ హౌస్‌ల నిర్మాణం తదితర అంశాలపై నిపుణుల కమిటీ మంగళవారం ఏరియల్ సర్వే నిర్వహించింది.   వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని దేవాదుల వద్ద చొక్కారావు ఎత్తిపోతల పథకం పరిధిలోని నీటి నిల్వలు, గోదావరి పొడవునా సర్వే చేశారు. కంతనపల్లి బ్యారేజ్ నిర్మాణం స్థలాన్ని పరిశీలించారు.  దేవాదుల 60 టీఎంసీలు, కంతనపల్లి 50 టీఎంసీలు, కాల్వ పరిసరాల్లోనూ పర్యటించారు.

మరిన్ని వార్తలు