బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు స్వాహా

4 Sep, 2015 20:10 IST|Sakshi

కరీంనగర్: ఓ వ్యక్తి ఖాతా నుంచి దుండగులు డబ్బులు కాజేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. జిల్లాలోని రామడుగుకు చెందిన ఖాజా అనే వ్యక్తికి ఫొన్ చేసిన దుండగులు బ్యాంకు అధికారులమంటూ మాట్లాడారు. తర్వాత అతడి నుంచి ఏటీఎం నంబరు వివరాలు తెలుసుకున్నారు. తర్వాత అతడి ఖాతా నుంచి రూ. 44 వేలు డ్రా చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు