బూర్జువా పార్టీల తీరు మారాలి

30 May, 2016 02:26 IST|Sakshi
బూర్జువా పార్టీల తీరు మారాలి

సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్
 
జడ్చర్ల : దేశంలో అధికారాన్ని చేపట్టిన బూర్జువా పార్టీలు పేదల అభివృద్ధి మరిచి ధనవంతుల సంక్షేమానికే పాటు పడుతున్నాయని సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్ ఆరోపించారు. ఆదివారం స్థానిక టీఎన్‌జీఓ భవనంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ వంటి  పార్టీలు పేదలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి వారికిచ్చిన హామీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. నిర్బంధ విద్యను అమలు చేసి అక్షరాస్యత శాతాన్ని పెంచాల్సిన ప్రభుత్వాలు బడ్జెట్‌లో కోత విధిస్తున్నారని ఆరోపించారు. దేశంలో దాదాపుగా 30 కోట్ల మందికి సెంటు భూమికూడా లేదని, అక్కడక్కడ పంపిణీ చేసిన భూములు సాగుకు పనికిరానివేనన్నారు.

ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక యువత విపత్కర సమస్యలు ఎదుర్కొంటోందని, దాదాపుగా 16 కోట్ల మంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా ఉపాధ్యక్షుడు దీప్లానాయక్, డివిజన్ కార్యదర్శి జగన్, మండల కార్యదర్శి సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు