సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వహించగా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా నేడు కరోనాతో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే 881 ఉండటం ఆందోళన రేకెత్తిస్తోంది. (ఇకపై అత్యవసర కేసులు మాత్రమే: ఏపీ హైకోర్టు)