'రూపాయి ఉంగరాల' బామ్మ

29 May, 2015 16:44 IST|Sakshi
'రూపాయి ఉంగరాల' బామ్మ

ఆదిలాబాద్ : ఎవరైనా ముత్యాలు, పగడాలు, వజ్రాలలాంటి రత్నాలు పొదిగిన బంగారు ఉంగరాలను ధరించడానికి ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిని ఆసక్తిగా ఆర్డరిచ్చి చేయించుకుంటారు. కానీ ఓ వృద్ధురాలు రూపాయి నాణాలు వేళ్లపై కనబడేలా ఉంగరాలు చేయించుకుని చేతివేళ్లకు ధరించి అందరినీ ఆకర్షిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కండెల గ్రామానికి చెందిన రుక్మిణి బాయికి మొదటి నుంచి అలంకరణ మీద అమితమైన ఆసక్తి. ఆమె అలంకరణ కూడా అందరికంటే భిన్నంగా ఉండేది. ఈ క్రమంలోనే రూపాయి నాణాలతో ఉంగరాలను తయారుచేయించుకుంది. ఆమె ధరించిన ఆ రూపాయి నాణాలు తన స్వార్జితమని, అవి తన కళ్ల ముందు ఎప్పుడూ కనబడుతూనే ఉండాలని ఇలా చేయించుకున్నానని అందరికీ చూపెడుతూ తెగ మురిసిపోతుంది ఈ రుక్మిణి బామ్మ.

మరిన్ని వార్తలు