'ఎంసెట్-2 కు మళ్లీ ఫీజు సరికాదు'

27 May, 2016 19:09 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణలో జూలై9 న నిర్వహించే ఎంసెట్-2 ప్రవేశ పరీక్షకు రెండవసారి పరీక్ష రుసుమును వసూలు చేయడం సరికాదని ఎస్సీఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సామల సింహాచలం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు మరలా పరీక్ష రుసుమును చెల్లించాలనే నిబంధన  పెట్టడం అన్యాయమన్నారు. ఈ నెల 15 న జరిగిన ఎంసెట్ పరీక్ష రాసిన విద్యార్ధులకు ఫీజు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్ధుల నుండి పరీక్ష రుసుము వసూలు చేసుకుంటే సమంజసమని.. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని సామల విజ్ఞప్తి చేశారు.
 

మరిన్ని వార్తలు