ఆలయ సమీపంలో తవ్వకాల కలకలం

31 Jul, 2015 03:39 IST|Sakshi

కోటపల్లి : మండలంలోని లింగన్నపేట-ఏదుల బంధం ప్రధాన రహదారి మార్గంలో అడవిలో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలకు పాల్పడ్డారు. వారం క్రితం ఈ ఘటన జరగినట్లు తెలుస్తుండగా తాజాగా వెలుగు చూసింది. గుప్త నిధు లు ఉన్నాయనే భావనతో సరిహద్దు మహారాష్ట్రకు  చెందిన వ్యక్తులు రాత్రి సమయంలో ఇక్క డ తవ్వకాలు జరిపినట్లు సమీప గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. క్షుద్రపూజలు చేసి టెం కాయలు కొట్టిన ఆనవాళ్లు ఉండడంతో ఈ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయ సమీపంలో రెండు గుంతలు ఉండగా, దుండగులకు సమీప గ్రామానికి చెందిన కొందరు సహకరించి ఉంటారని గ్రామాల్లో ప్రచారం సాగుతోంది. కాగా ఈ విషయమై సమీప లింగన్నపేట అటవీ బీట్ అధికారి జాలీంషాను వివరణ కోరగా ఆలయ సమీపంలో గుంతలు ఉన్నాయన్న సమాచారం వాచ ర్ ద్వారా అందిందని తెలిపారు. అయితే, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు