మద్దతు ధర కోసం రైతుల రాస్తారోకో

11 Jan, 2016 17:51 IST|Sakshi

తిరుమలగిరి : నల్లగొండ జిల్లా తిరుమలగిరిలో వేరుశనగ మద్దతు ధర కోసం రైతులు సోమవారం రాస్తారోకో చేశారు. మార్కెట్‌యార్డులో క్వింటాలు వేరుశనగ శనివారం రూ.5,900 నుంచి రూ.6,300 పలికింది. సోమవారం ఆ ధరను రూ.4 వేల నుంచి రూ.5 వేలకు తగ్గించేశారు. దీంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సుమారు 300 మంది రైతులు మద్దతు ధర ఇవ్వాలనే డిమాండ్‌తో మధ్యాహ్నం సూర్యాపేట-జనగామ రహదారిపై రాస్తారోకో చేశారు.

మరిన్ని వార్తలు