జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా): కుటుంబాన్ని పట్టించుకోకుండా, చెడువ్యసనాలకు బానిసై జలాయిగా తిరుగుతున్నాడని తండ్రి కుమారుడిని హత్యచేశాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చైతన్యపురి కాలనీలో గురువారం చోటుచేసుకుంది. నరస్సయ్య కుమారుడు గణేష్(25)కు వివాహాం అయింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. తండ్రి ఎన్నిసార్లు చెప్పినా కుటుంబ బాగోగులు పట్టించుకోలేదు. జలాయిగా తిరిగుతున్నాడని ఆగ్రహించినా తండ్రి నరస్సయ్య గణేశ్ను కత్తితో పోడిచి హతమార్చాడు. సమాచరం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు నరస్సయ్య పరారీలో ఉన్నాడు.