స్కూల్ బస్సు బోల్తా : ఐదుగురికి గాయాలు

22 Jun, 2015 16:13 IST|Sakshi

వేములవాడ : కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం జయరామ్ గ్రామం వద్ద సోమవారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. వేములవాడలోని హంసిని పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులను వారిళ్ల వద్ద దింపి తిరిగి వెళుతుండగా జయరామ్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. అయితే ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ ఐదుగురికి గాయాలయ్యాయి. విద్యార్థులు లేకపోవడంతో డ్రైవర్ ప్రయాణికులను ఎక్కించుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు