హార్టికల్చర్ వర్సిటీకి శంకుస్థాపన

7 Jan, 2016 15:34 IST|Sakshi

ములుగు లో హార్టికల్చర్ యూనివర్సిటీకి తెలంగాణ సీఎం కే సీఆర్ శంకుస్తాపన చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు రాధామోహన్ సింగ్, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాధా మోహన్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రైతూ.. తన బిడ్డను రైతు చేయాలనుకునే రోజు రావాలని ఆకాంక్షించారు. వ్యవసాయం లాభసాటిగా మారాలని అన్నారు. మరో వైపు ముఖ్య మంత్రి కేసీఆర్ ఏప్రిల్ 30 కల్లా ప్రతి ఇంటికీ నల్లా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహాకారం కావాలని కోరారు.
 

మరిన్ని వార్తలు