హైదరాబాద్:హుమాయున్నగర పోలీసు స్టేషన్ పరిధిలో నివాసముంటున్న ముగ్గురు అక్కాచెల్లెల్లతో పాటు వారి స్నేహితురాలు అదృశ్యమైన ఘటన వెలుగు చూసింది. ఓవైసీపురాకు చెందిన మహ్మద్ ఇషాకు ముగ్గురు కుమార్తెలు. సైఫా ఫాతిమా, రాషాఫాతిమా, అఫ్రీన్ ఫాతిమాలు సోమవారం ఇంటి నుంచి వెళ్లి అనంతరం అదృశ్యమయ్యారు. వీరు ఇంటర్, డిగ్రీ చదువుతున్నారు.
కుటుంబ కలహాల నేపథ్యంలోనే పిల్లలు అదృశ్యమై ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. వీరు వెళ్లే సమయంలో ఇంట్లో నుంచి నగదు, బంగారు ఆభరణాలు తీసుకెళ్లారని మహ్మద్ఇషా పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.