అంతర్జాతీయ వేదికపై ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని

23 Feb, 2018 08:13 IST|Sakshi
సౌమ్య రావత్‌

రాయదుర్గం: బ్యాంకాక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ట్రిపుల్‌ఐటీ–హైదరాబాద్‌ విద్యార్థిని సౌమ్య రావత్‌ పరిశోధనాత్మక పత్ర సమర్పణ చేశారు. ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన 24వ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ మల్టీమీడియా మోడలింగ్‌ సదస్సులో ఆమె పాల్గొన్నారు. ‘ఫైండ్‌ మీ ఏ స్కై: ఏ డేటా డ్రివెన్‌ మెథడ్‌ ఫర్‌ కలర్‌ కన్సిస్టెడ్‌ స్కై సెర్చ్‌ అండ్‌ రీప్లేస్‌మెంట్‌’ అంశంపై పత్ర సమర్పణ చేసి ప్రశంసలు అందుకుకున్నారు. అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేస్తున్న విద్యార్థినికి ఈ అవకాశం రావడం విశేషమని అధ్యాపకులు అభినందించారు.

మరిన్ని వార్తలు