పేట్ బషీరాబాద్‌లో కార్డన్ సెర్చ్

28 Jun, 2015 07:49 IST|Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో కార్డన్ సెర్చ్ జరిగింది. వాజ్‌పేయ్ నగర్‌లో ఆదివారం వేకువజామున 200 మంది పోలీసులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన ధ్రువ పత్రాలు లేని 2 ఆటోలు, 12 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 18 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
 

మరిన్ని వార్తలు