‘కార్తీకం... దేదీప్యం

26 Nov, 2015 00:34 IST|Sakshi
‘కార్తీకం... దేదీప్యం

కార్తీక దీపాలు.. సామూహిక వ్రతాలు.. భగవన్నామస్మరణలతో మెతుకుసీమ ఆధ్యాత్మిక సీమగా శోభిల్లింది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. జిల్లాలోని ప్రధాన ఆలయాలైన ఏడుపాయల, నాచగిరి, కేతకీ తదితర ఆలయాలకు తెల్లవారుజామునుంచే భక్తుల తాకిడి మొదలైంది. రాత్రి వేళ కార్తీక దీపోత్సవం.. నేత్ర పర్వమైంది. వివిధ ఆకృతుల్లో దీపాలను వెలిగిస్తూ భక్తులు భక్తిపారవశ్యంలో తన్మయత్వం పొందారు.
 

మరిన్ని వార్తలు