-

కొడుకు పుట్టలేదని చిత్రహింసలు..

21 Jan, 2016 18:18 IST|Sakshi

హైదరాబాద్ : కొడుకు పుట్టడం లేదని ఓ కిరాతకుడు భార్యను ఐదేళ్లుగా చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త వేధింపులను పంటి బిగువున భరిస్తూ సంసారాన్ని ఈదుతున్న మహిళ..  ఆ రాక్షసుడు మరింత విరుచుకుపడి విపరీతంగా కొడుతుండటంతో పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన నగరంలోని సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది.

స్థానికంగా నివాసముంటున్న అబ్దుల్ రహీంకు ఆరేళ్ల క్రితం ఫర్హా బేగంతో వివాహమైంది. అప్పటి నుంచే మగబిడ్డ పుట్టలేదని హింసిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చిత్రహింసలు ఎక్కవవడంతో మనోవేదనకు గురైన మహిళ గురువారం సరూర్‌నగర్ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మరిన్ని వార్తలు