నాటిన ప్రతి మొక్క బతకాలి

2 Aug, 2018 13:03 IST|Sakshi
మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

గండేడ్‌ (మహబూబ్‌నగర్‌): ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో నాటిస్తున్న ప్రతి మొక్క బతకాలని, అప్పుడే లక్ష్యం నెరవేరుతుందని పరిగి ఎమ్మెల్యే టి. రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా బుధవారం మండల పరిధిలోని నంచర్ల గురుకుల పాఠశాలలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ సమతౌల్యాన్ని కాపాడుకోవాలంటే అటవీసంపదను పెంచుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు.  పాఠశాల, కళాశాల, ప్రభుత్వ కార్యాలయాల మొక్కలతో పచ్చబడాలని కోరారు.

గత ఏడాది హరితాహరం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను బతికించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శాంతీబాయి, వైస్‌ ఎంపీపీ రాధారెడ్డి, ప్రిన్సిపల్‌ వెంకటమ్మ, సిబ్బంది, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, నాయకులు కేఎం నారాయణ, జితేందర్‌రెడ్డి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, ఎఫ్‌ఆర్‌ఓ మగ్దూమ్, ఏపీఓ హరిచ్చంద్రుడు, ఎంపీటీసీలు చెన్నమ్మ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
    

మరిన్ని వార్తలు