వేములవాడ: శివకల్యాణోత్సవానికి హాజరైన లక్షలాది మంది భక్తులతో ధర్మగుండం నీళ్లు అపరిశుభ్రంగా మారడంతో ఆలయ అధికారులు వాటిని తొలగించి కొత్తనీరు నింపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం వరకు ఎల్ఎండీ నుంచి వస్తున్న స్వచ్ఛమైన నీరు ధర్మగుండం కింది మెట్ల వరకు చేరుకున్నాయి.
మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో నీళ్లు నింపనున్నట్లు ఈఈ రాజయ్య తెలిపారు. ఈనెల 25న సీతారాముల కల్యాణోత్సవానికి మూడు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశాలు ఉండటంతో ముందుస్తుగా చర్యలు చేపట్టారు. దీంతో గురువారం భక్తులు షవర్ల వద్ద స్నానాలు చేశారు.